Saturday, April 21, 2012

కృషి ఉంటే మనుషులు......


ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు....

ఏంటి రాజకీయ నాయకుడి లా మాట్లాడుతున్నావ్.... అంటారా...

ఏదో ఆవేశం వచ్చినప్పుడు అలా వస్తూఉంటాయి... అర్థం చేస్కోండీ...

ఒక మహానుభావుడు మరో మహానుభావునికి రాసిన పాట గుర్తుకొచ్చి అలా అన్నాను..

ఎవరా ఇద్దరు మహానుభావులు బాబు అని మీరు ఆల్రెడీ ప్రశ్నించి వుంటారని నాకు తెలుసు... చెప్తాను...చెప్తాను ఆగండి

ఒకరు నట సార్వభౌముడు మన అన్న గారు... ఇంకొకరు తెలుగు పదాలతో సిరిసిరిమువ్వలు పలికించిన మన వేటూరి గారు..

అన్న గారి మీద అభిమానం ముప్పై సంవత్సరాల నాటిది...అంటె మనం నిక్కర్లు వేసుకొని తెరిగే నాటినుంచి అది మన నర  నరాలలో జీర్ణించుకొని పోయింది అన్నమాట....దాని గురించి చెప్పాలంటే ఒక పోస్ట్ సరిపోదు... కాబట్టి ఇంకోసారి బాగా తీరిక వున్నప్పుడు మాట్లాడుకొందాం..

ఇకపోతే మన వేటూరి వారు... ఎమి చెప్తాము చెప్పండి వారి గురించి... మనమా పండితులం కాదు.. తెలుగు లో ఆయన రాసిన వాటిని విశ్లేషించి విమర్శనాపూర్వకంగా రాయటానికి... 

ఒక్క నిమిషం... మన వేటూరి వారు రాసిన పాటలు అర్థం చేసుకోడానికి పాండిత్యం అవసరమా? కేవలం పండితులే అర్థం చేసుకోనేట్టు ఆయన రాసివుంటే మనకు ఆయన పేరే తెలిసివుండేది కాదు కదా...

వేటూరి వారికి నేను అభిమానిని అనిచేప్పటానికి నాకు ఒక్క కారణం చాలు...
మన తెలుగు లో అప్పటికీ... ఇప్పటికీ...ఇక ఎప్పటికీ.. మంచి స్పూర్తినిచ్చే పాట ఒకటే... దాని తరవాతే ఏదన్నా..


మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ

కృషి ఉంటే మనుషులు ౠషులౌతారు మహాపురుషులౌతారు

తరతరాలకీ తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారూ


అడుగో అతడే వాల్మీకీ బ్రతుకు వేట అతనికీ

అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి

అడుగో అతడే వాల్మీకీ

పాల పిట్టల జంట వలపు తేనెల పంట

పండించుకుని పరవశించి పోయే వేళ

ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడూ

జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగ

ఆ శోకం లో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే

కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా

మనిషి అతడిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు

నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం

ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడూ

అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడూ

అందుకే కృషి ఉంటే మనుషులు ౠషులౌతారు మహాపురుషులౌతారు

తరతరాలకీ తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారూ....
.....

......
ఈ ఒక్క పాట తో నేను వేటూరి వారికి ఎప్పుడో అభిమానినైపోయాను... ఆ పాట ఎప్పుడు విన్నా ఏదో ఆవేశం..ఆహా ఎంత బాగా చెప్పారు.. ఒక మనిషిని కర్యోన్ముఖుడిని చేసేందుకు కావలసినంతా అందులో చాలా చక్కగా చెప్పారు.. మనిషి తలచుకొంటే సాధించలేనిది ఏమీ లేదు అని చాలా సామాన్యులు గా ఉండి తాము చేసిన పనులతో చరిత్ర లో చిరస్థాయిగా మిగిలిపోయిన వారిని ఉదహరిస్తూ..... 

నా ఉద్దేశం లో ఆ పాట తరువాత ఇంతవరకూ అంతటి పవర్ ఉన్న పాట మరీ రాలేదు...కాదంటారా..

ఏమిటా పవర్? ఏం మాట్లాడుతున్నావు.. ఒక పాటకే పవర్ ఉంటే మరి మనలో ఎంతో మంది చరిత్ర పురుషులు అయ్యి ఉండేవారుకదా?? అంటారా...

ఆ పాటకు ఖచ్చితంగా సరిపోయే మన నట సార్వభౌముడు లేడా.... కృషితో.. సంకల్ప భలంతో ఎక్కడో నిమ్మకూరులో పుట్టి ఇంటింటికీ పాలు పోసిన ఆయన నటనలో తనకు సాటి ఎవరు అని ప్రపంచాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగి... తనను అభిమానించిన తెలుగు వారి ఋణం తీర్చుకోవాలన్న ఆలోచనతో తాను నిర్మించుకొన్న నటనా శిఖరాలను విడిచి రాజకీయాలలోకి వచ్చి... శతాబ్ద కాల కరడుగట్టిన కాంగ్రెస్స్ వాదులను ఒక్క దెబ్బతో ఖంగు తినిపించి న ఆ మహానుభావుడి జీవితం... ఆ పాటకు సరిగ్గా సరిపోతుంది అనడానికి అనుమానమే లేదు..

కష్టపడి కీర్తి సంపాదించి ఆ స్వకష్టంతో వచ్చిన సంపాదనతో ఉన్నత శిఖరాలు చేరిన మన వాళ్ళు ఎందరో ఉన్నారు వారందరికీ వందనాలు..

అలా కష్టపడి తాను పైకివచ్చి మా అందరినీ ఈ స్థితికి తెచ్చిన మా నాన్న నాకు ఎప్పటికీ స్పూర్తే.....

కానీ యిప్పటి యువత అలా కష్ట పడి పైకివచ్చిన వారిని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నారా? అదే నిజమైతే మరి అవినీతి లో కూరుకు పోయికూడా నాయకులుగా చలామని అవుతున్నారు..... వారి ధైర్యం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.. అలా అని అందరూ వారినే సమర్థిస్తున్నారని చెప్పటం నా ఉద్దేశం కాదు.. కానీ అలాంటి వారికి కనీసం ఒక్క ఓటన్నా ఎలా పడుతోంది అన్నదే నా ప్రశ్న...మనం ఆలోచించి ఓటేస్తే ఇప్పటి నాయకులకు ఎంత మందికి డిపాజిట్లైనా దక్కుతాయి అని ఒక లిస్టు వేస్తే అందులో నేటి నాయకులు ఎంత మంది ఉంటారు?

అసలు ఆలోచించి ఓటు వేసేవారు వున్నారా అని లిస్టు వేస్తే? అదేంటి కామెడీ ప్రశ్న? అందరూ అలోచించి గెలిచేవాడికే వోట్లు వేస్తున్నాము కదా అంటారా.....

ఈ మధ్య ఒక ఆర్గుమెంట్ లో అదే అన్నాడు ఒక చదువుకొన్న ఫ్రెండ్...గెలిచేవాడు ఎవరనా మనమాలోచిన్చాల్సిండేది.. సమర్థుడు ఎవరనా?... సమర్థుడు అంటె ఇక్కడ మంచి విధాన పరుడని.. మంచి విధాన పరుడంటే ప్రజలకు మంచి చేసే విధానాలను తెచ్చే వాడని నా అర్థం..
మరి మంచి విధాన పరుడుఎవరు అని మనం ఆలోచిస్తున్నామా? .. ఏంటి సత్య కాలం నాటి మాటలు...అంటారా..

ఏ కాలమైనా... నాకేంటి లాభం... నా కులం వాడా కదా.. నా కులపోడైతే ఒట్లేస్తాను... ఉచితంగా ఇస్తే ఒట్లేస్తాను.. గెలిచేవాడికే వోట్లేస్తాను ...అనుకోవడం ఏ రాజకీయ వ్యవస్థకూ ఆధారం కాకూడదు ... అదే జరుగుతూ పోతే మనం ఆధునికత నుంచి మరీ  Might was Right  అన్న అనాగరికత వైపు వెళ్లడం కాదా ....

అసలు గెలిచేవాడు అని ఓటువేసేముందే ఎలా అనుకొంటాం?..ఏ ప్రాతిపదిక మీద అలా అనుకొంటాం?...

ఏంటి రోయ్.. తెలుగు సినిమా పాట అని మొదలెట్టి ఎక్కడికో వెళుతున్నావు... స్వర్గం నరకం అని కామెడీలు రాసే వాడు......వీడికి దొబ్భింది రోయ్ .. ఏది.. తల టర్నింగ్ ఇచ్చుకో.. చిన్న మెదడేమన్నా చితికిందేమో చూద్దాం... అంటారా...

లైట్ తీస్కో గురూ.. చెప్పా కదా ఆ పాట విన్నప్పుడు ఏదో ఆవేశం అని... ఇప్పుడే విన్నా ఇంకోసారి.... అదీ విషయం..

అదే పాట స్ఫూర్తి తో.. నేనూ ఒక పాట రాసాను.. ఓపిక ఉంటే.. ఒక్కసారి....
............
మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బుర్ర
గుర్రు కొట్టి నిద్రపోతే అవుతుంది ఇల్లు గుళ్ళ.....

కుటిలంతో కొందరు నేతలవుతారు... మహా మేత లవుతారు...
తర తరాలకూ తరగని సిరులిస్తారు.. కులవేలుపులవుతారు...

అదుగో అతడో కులనేత, వోట్ల వేట అతనిది..
అతి భయంకరుడు యమకింకరుడు ఫాక్షనిష్టుల పాలిటి.....

కరువు మంటతో, పండని కలల పంట తో ఆర్థ నాదం చేయు వేళ...
ఆ అన్నదాత పై గురి పెట్టాడు...కారణం బాబు అన్నాడు
వోట్ల వర్షమే కురవగా ... ఫీఠం తనదే అవ్వగా ...
భూములన్నీ కాజేసి, అయిన వారికి ధార పోసి న ....
అ కులనేత మన వాడు....మనకోసం ఉన్నాడు..అని జనం విఘ్నత మరిచారు, మహానేతను చేసారు....

అందుకే
కుటిలంతో మనుషులు నేతలవుతారు... మహామహా మేత లవుతారు...
తర తరాలకూ తరగని సిరులిస్తారు.. కులవేలుపులవుతారు...
..........

ఇప్పుడు నిజంగానే వీడికి చిన్న మెదడు ఖచ్చితంగా  చితికింది అని నిర్ధారించు కున్నారు కదూ.....

ఒకే ఫ్రెండ్స్.. ఇందాక చెప్పినట్లు లైట్ తీసుకొని... వచ్చే ఉప ఎన్నికల్లో కూడా గెలిచేవాడికే మన ఓటు... అన్న మన ఆలోచనా సరళిలో ఏ మార్పూ లేకుండా అలా గడిపేద్దాం కాలం యిప్పటికి....

ఉంటా మరీ ఎప్పుడో కలుద్దాం, నా ఈ చితికిన చిన్న మెదడులో ఏదో ఒక ఆలోచన వచ్చినప్పుడు.. మళ్ళీ మీ టైం కొంచం వేస్ట్ చేసేకి......